హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని ఓల్డ్సిటీలో డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీన్యాబ్) పోలీసులు అరెస్ట్ చేశారు. టీన్యాబ్ ఎస్పీ చక్రవర్తి తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడకు చెందిన మీర్జా అస్గర్ అలీ బేగ్(28), మహ్మద్ సాజిద్(27), సైదాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ సల్మాన్ ఖాన్(30) రెండేండ్లుగా ఓల్డ్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల్లోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నారు.
ఈ గ్యాంగ్ ఎండీఎంఏ డ్రగ్ ను అమ్ముతున్నట్లు టీన్యాబ్ పోలీసులకు సమాచారం అందింది. గురువారం డబీర్పురాలోని రజియా మసీదు వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఎండీఎంఏ డ్రగ్ను కస్టమర్లకు అమ్ముతున్న ఈ ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2 లక్షల విలువైన 12 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ తో పాటు బైక్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.