అరుదైన రికార్డ్..ఒకే సారి ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి

అరుదైన రికార్డ్..ఒకే సారి ముగ్గురు అన్నదమ్ములు అసెంబ్లీకి

ఇప్పటి వరకు ఒకే ఫ్యామిలీ  నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం చూశాం. వేర్వేరు పార్టీల నుంచి అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా గెలవడం చూశాం. కానీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే తల్లికి పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు ఒకే పార్టీ నుంచి ఒకేసారి ఎమ్మెల్యేలుగా గెలిచి అరుదైన రికార్డ్ సృష్టించారు.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ  నుంచి ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి ఎమ్మెల్యేగా గెలిచి ఈ  రికార్డ్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని నుంచి ఎల్లారెడ్డి సాయిప్రసాద్ రెడ్డి, ఆయన సోదరుడు వై. బాలనాగిరెడ్డి అదే జిల్లా మంత్రాలయం నుంచి, మరో సోదరుడు వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు.