హైదరాబాద్, వెలుగు: ముగ్గురు సీఈలకు ఈఎన్సీలుగా ఇరిగేషన్శాఖ ప్రమోషన్ కల్పించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈఎన్సీలను భర్తీ చేసింది. ఈ మేరకు బుధవారం ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం సూర్యాపేట సీఈగా పనిచేస్తున్న వెంకట రమేశ్ బాబును ఈఎన్సీ అడ్మిన్గా ప్రమోట్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి సీఈగా ఉన్న తమతం శ్రీనివాస్ను కామారెడ్డి ఈఎన్సీగా, నిజామాబాద్ సీఈగా పనిచేస్తున్న మధుసూదన్రావును నిజామాబాద్ ఈఎన్సీగా ప్రమోట్చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
