తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్జిల్లా తిమ్మాపూర్మండలం అలుగునూర్లోని వెలిచాల జగపతిరావు క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న కాకా వెంకటస్వామి స్మారక తెలంగాణ అంతర్ జిల్లా టీ-20 లీగ్ రెండోరోజూ కొనసాగింది. బుధవారం ఉదయం జరిగిన మొదటి మ్యాచ్లో రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన పెద్దపల్లి జిల్లా ఫీల్డింగ్ ఎంచుకోగా.. సిరిసిల్ల జట్టు 19.5 ఓవర్లలో 158 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.
ఈ జట్టులో రాజు 70 పరుగులు చేయగా పెద్దపల్లి జట్టులో రాహుల్, రుమాన్ తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం పెద్దపల్లి జట్టు 16.2 ఓవర్లలో 74 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆ జట్టులో సాయితేజ 4 వికెట్లు తీశాడు. ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన రాజుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మధ్యాహ్నం జరిగిన రెండో మ్యాచ్లో జగిత్యాల, కరీంనగర్ జిల్లా తలపడ్డాయి. టాస్ గెలిచి కరీంనగర్ జట్టు బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. కరీంనగర్ జట్టులో అక్రం 27 పరుగులు, సాత్విక్ 24 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జగిత్యాల జట్టు కేవలం 41 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
కరీంనగర్ జట్టులో అర్షద్ 3 ఓవర్లు వేసి 3 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అద్భుత బౌలింగ్ ప్రదర్శనకుగానూ అర్షద్కు మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి అతనికి క్యాష్ రివార్డు అందించారు. కేడీసీఏ ప్రెసిడెంట్ వెలిచాల ఆగంరావు, వైస్ ప్రెసిడెంట్ కోడూరి మహేందర్ గౌడ్, పి.మనోహర్రావు, సెక్రటరీ ఎన్.మురళీధర్రావు, ఈసీ మెంబర్లు హరికృష్ణగౌడ్, ఆర్.సాగర్ రావు, సీహెచ్.అజిత్ కుమార్టోర్నీని పర్యవేక్షించారు.
