కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా నరేందర్ రెడ్డి

కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా నరేందర్ రెడ్డి

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్​గా జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ అడ్వకేట్ బండారి సురేందర్​రెడ్డి నియమితులయ్యారు.  కేంద్ర ప్రభుత్వ లా  మినిస్ర్టీ, జస్టిస్​ నుంచి ఈ మేరకు నియమించారు.  

సీనియర్ అడ్వకేట్​తో పాటు ప్రస్తుతం బీజేపీ జిల్లా లీగల్ సెల్​ కన్వీనర్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. తన నియామకానికి కృషి చేసిన స్టేట్ లీగల్​ సెల్ కన్వీనర్ రామారావు,  బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ రామచంద్రారావు,  ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిలకు సురేందర్​రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.