మూడ్రోజులు స్పెషల్​  రైళ్లు రద్దు

మూడ్రోజులు స్పెషల్​  రైళ్లు రద్దు

సికింద్రాబాద్​, వెలుగు : టెక్నికల్​సమస్యల కారణంగా పలు మార్గాల్లో నడుస్తున్న స్పెషల్​రైళ్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి– -కాచిగూడ, కాకినాడ టౌన్​– -సికింద్రాబాద్– -కాకినాడ టౌన్, నర్సాపూర్– -సికింద్రాబాద్– -నర్సాపూర్ రైళ్లు

ఈ నెల17 నుంచి 19 వరకు అందుబాటులో ఉండవన్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు. ఇదే మార్గాల్లో నడుస్తున్న ఇండిపెండెన్స్​ డే స్పెషల్​రైళ్లు ఈనెల 17 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.