హైటెన్షన్​ విద్యుత్​ వైర్లు తగిలి ముగ్గురికి గాయాలు

హైటెన్షన్​ విద్యుత్​ వైర్లు తగిలి ముగ్గురికి గాయాలు

పంజగుట్ట,వెలుగు: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా హైటెన్షన్​ విద్యుత్​ వైర్లు తగిలి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన బోరబండ పోలీసు స్టేషన్​పరిధిలో జరిగింది. బోరబండ పరిధి బంజారానగర్​కు చెందిన  గౌసియా బేగం, మసరత్​బేగం, ఫర్హదా బేగం తమ ఇళ్లపై ఉతికిన బట్టలను ఆరేస్తుండగాపై నుంచి పోయే హైటెన్షన్​ విద్యుత్ వైర్లు ముగ్గురు మహిళలకు తాకడంతో వారికి గాయాలయ్యాయి.

గౌసియా బేగంకు తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.