పంజగుట్ట,వెలుగు: ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మహిళలకు గాయాలైన సంఘటన బోరబండ పోలీసు స్టేషన్పరిధిలో జరిగింది. బోరబండ పరిధి బంజారానగర్కు చెందిన గౌసియా బేగం, మసరత్బేగం, ఫర్హదా బేగం తమ ఇళ్లపై ఉతికిన బట్టలను ఆరేస్తుండగాపై నుంచి పోయే హైటెన్షన్ విద్యుత్ వైర్లు ముగ్గురు మహిళలకు తాకడంతో వారికి గాయాలయ్యాయి.
గౌసియా బేగంకు తీవ్రగాయాలవడంతో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సోమవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.