ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

ఏపీ కృష్ణా జిల్లాలోని జొన్నలగడ్డ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వాళ్లంతా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదల వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో మొత్తం 25 మంది కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది.

More News: ట్రూజెట్‌ విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం

నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు