తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్టు ?

తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్టు ?

హైదరాబాద్ లోని మియాపూర్ లో తుపాకుల కలకలం రేగింది.  తమిళనాడుకు చెందిన ఓ రౌడీ షీటర్, ఒక కంపెనీలో డెలివరీ బాయ్స్ గా పనిచేసే ఇద్దరు వ్యక్తుల వద్ద దేశవాళీ తుపాకులు,  పిస్టల్స్, మేగజైన్స్, బుల్లెట్లు, తపంచను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెంటనే వారిని అదుపులోకి  తీసుకున్నారు. బీహార్ నుంచి ఆ ఆయుధాలను తెప్పించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈవిషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. తుపాకులను ఎందుకు తెప్పించారు ? తమిళనాడుకు చెందిన రౌడీ షీటర్ ఇక్కడ ఎందుకు సంచరిస్తున్నాడు ? అనే వివరాలు తెలియాల్సి ఉంది.