తాజ్ మహల్ యొక్క పాలరాతి రైలింగ్ కూలి ముగ్గురు మృతి చెందారు. శుక్రవారం రాత్రి ఆగ్రాలో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షానికి తాజ్ మహల్తో పాటు, చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇళ్లు, కొన్ని చెట్లు దెబ్బతిన్నాయి. చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా అధికారులు రూ .4 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు.
‘తాజ్ మహల్ రైలింగ్ కూలిన ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరియు అనేక జంతువులు చనిపోయాయి. కొన్ని ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. ఘటనపై సర్వే చేసి నష్టాలను అంచనావేస్తాం. మరణించిన వారి కుటుంబాలకు తాజ్ మహల్ పరిపాలన విభాగం రూ .4 లక్షలు ఆర్థిక సహాయంగా అందిస్తుంది’అని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ యోగేంద్ర కుమార్ తెలిపారు.
తుఫాను ధాటికి తాజ్ మహల్ కాంప్లెక్స్లోని చెట్లు, స్మారక చిహ్నం, పాలరాయి రైలింగ్ దెబ్బ తిన్నాయి. వెస్ట్రన్ గేట్ వద్ద ఉన్న టికెట్ కౌంటర్ మరియు ఫ్రిస్కింగ్ గేట్లు దెబ్బతిన్నాయి. కాంప్లెక్స్లోని అనేక చెట్లు కూలిపోయాయి. యమునా నది వైపు ప్రధాన సమాధి వెనుక భాగంలో ఉన్న పాలరాయి రైలింగ్లో కొంత భాగం పడిపోయింది మరియు ఎర్ర ఇసుకరాయి రైలింగ్ యొక్క రెండు ప్యానెళ్లు కూడా దెబ్బతిన్నాయి’ అని సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ బసంత్ కుమార్ స్వరంకర్ తెలిపారు.
For More News..