దొంగతనం కేసులో ఐదేండ్ల జైలు

దొంగతనం కేసులో ఐదేండ్ల జైలు

జీడిమెట్ల, వెలుగు : దుండిగల్​ పీఎస్​పరిధిలోని మల్లంపేట్, ప్రణీత్​ప్రనవ్​వ్యాలీ హోమ్స్​లో 2021లో జరిగిన దోపిడీ కేసులో కోర్టు ముగ్గురికి ఐదేండ్ల జైలు శిక్ష, రూ. రూ.2000 జరిమాన విధించింది.  నాలుగేండ్ల కింద 11 మంది ప్రణీత్​ప్రనవ్​వ్యాలీ హోమ్స్​గోడ దూకి లోపలికిప్రవేశించారు. సెక్యూరిటీని తాళ్లతో కట్టి, తుపాకులతో బెదిరించి స్టోర్​రూమ్​లోని రూ.24లక్షల విలువైన ఎన్​సీబీ, ఆర్​సీసీబీ బండిల్స్ దొంగిలించారు.

పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించిన కోర్టు  శైలేంద్రసింగ్​ (22) ధర్మేంద్ర కుమార్​ (26), సత్యభాన్​ సింగ్​ (23)లకు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది.