- చెట్టును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు యువకులు మృతి
- మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు
- సంగారెడ్డి జిల్లా సింగూర్ వద్ద ప్రమాదం
జోగిపేట, వెలుగు: సింగూరు డ్యామ్ చూద్దామని విహారయాత్రకు బైక్పై వెళ్లిన ముగ్గురు యువకులు చెట్టును ఢీకొట్టి మృతిచెందారు. మంగళవారం రాత్రి సింగూరు వద్ద ఈ యాక్సిడెంట్ జరిగింది. మెదక్ టౌన్కు చెందిన జమీర్(17), సమీర్(18), తౌఫిక్(18) సింగూరు డ్యామ్ చూసేందుకు బయల్దేరారు. బైక్ పై స్పీడ్గా వెళ్తున్న వీరు అదుపు తప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీ కొట్టారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు యువకులను 108లో సంగారెడ్డి సర్కారు దవాఖానకు తీసుకెళ్తుంటే జమీర్, సమీర్ మృతిచెందారు. తౌఫిక్ను హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. సమీర్, జమీర్ ఇద్దరు అన్నదమ్ములు. వీరి మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు నర్సాపూర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో 9, పదో క్లాస్ చదువుతున్నారు. బుధవారం మెదక్ లో అంత్యక్రియలు జరిగాయి. మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.