శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఏఎస్ఐ మృతి

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఏఎస్ఐ మృతి

శ్రీనగర్‌లోని పంతా చౌక్ వద్ద భద్రతా బలగాలకు మరియు టెర్రరిస్టులకు మధ్య గత రాత్రి నుంచి కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు.

‘శ్రీనగర్ లోని పంతా చౌక్ ప్రాంతంలో శనివారం రాత్రి పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) సంయుక్తంగా నాకా బందీ నిర్వహించాయి. ఈ నాకా బందీపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ) బాబు రామ్ ప్రాణాలు కోల్పోయాడు. దాంతో పోలీసులు మరియు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పంతా చౌక్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులు జరిపారు. అప్పుడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయారు’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

For More News..

రన్నింగ్ బస్ లో పడుకున్న మహిళపై అత్యాచారం

తెలంగాణలో మరో 2,924 కరోనా కేసులు నమోదు

నాకు ఆ పాత్ర చేయాలని ఎప్పటినుంచో ఉంది