జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో గురువారం తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. శ్రీనగర్లోని బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారంతో తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఫిర్దౌసాబాద్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కూంబింగ్ నిర్వహించింది. ఆ సమయంలో ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా ఆర్మీ కూడా ఎదురుకాల్పులకు దిగింది. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో కూంబింగ్ కాస్తా ఎన్కౌంటర్గా మారింది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందగా.. కౌన్సర్ రియాజ్ అనే మహిళ కూడా మృతి చెందింది. కాగా.. ఈ కాల్పుల్లో ఇద్దరు సిఆర్పీఎఫ్ జవాన్లు కూడా గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్చామని.. కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వారు తెలిపారు.
For More News..