నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో.. గల్లంతైన ముగ్గురు యువకులు మృతి

 నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో.. గల్లంతైన ముగ్గురు యువకులు మృతి
  •     బయటపడిన డెడ్​ బాడీలు

నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు: సరదాగా క్రికెట్  ఆడుకొని నిజాంసాగర్  ప్రాజెక్టుకి ఈతకు వెళ్లిన యువకులు చనిపోయారు. ముగ్గురు యువకులు సోమవారం గల్లంతవగా, మంగళవారం వారి డెడ్​బాడీలు బయటపడ్డాయి. బాన్సువాడ రూరల్  సీఐ రాజేశ్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండలానికి చెందిన 10 మంది యువకులు సోమర్ పేట్  సమీపంలో క్రికెట్ ఆడేందుకు వెళ్లారు.

క్రికెట్  ఆడిన తర్వాత మహమ్మద్ నగర్  మండలం హసన్ పల్లి గ్రామ శివారులో పిప్పిర్యాగడి తండా నిజాంసాగర్  ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఈత కొట్టేందుకు వెళ్లగా, ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. నిజాంసాగర్  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలించగా, మంగళవారం మధ్యాహ్నం డెడ్​బాడీలు బయటపడ్డాయి. ఎల్లారెడ్డికి మధుకర్ గౌడ్(18), తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్(25), సోమార్ పేట్ గ్రామానికి చెందిన హర్షవర్ధన్(17) చనిపోయారు. బాధితుల పేరెంట్స్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై శివకుమార్ తెలిపారు.