బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్

బీజేపీలో చేరిన తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్

బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటేకార్ మధు మోహన్ బీజేపీలో జాయిన్ అయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇంఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మంతనాలు ఫలించటంతో మధు కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన కాంటేకార్ మధు మోహన్ కు ఛైర్మన్ ఆశచూపి కారెక్కించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కొంతకాలంగా అందెల శ్రీరాములుతో టచ్ లో ఉన్న ఛైర్మన్ మధు మోహన్ పార్టీలో చేరేందుకు అంగీకరించారు. దీంతో రెండురోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి బీజేపీ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్ సహా బీజేపీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

కేసీఆర్ వ్యాఖ్యలను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నిరసనలు