మహిళా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లను ప్రోత్సహించేందుకు టై విమెన్ రోడ్షో

మహిళా స్టార్టప్‌‌‌‌‌‌‌‌లను ప్రోత్సహించేందుకు టై విమెన్ రోడ్షో

హైదరాబాద్, వెలుగు: మహిళలు నిర్వహించే స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రొటో టైపింగ్​సెంటర్​ టీ–వర్క్స్​లో విమెన్​రోడ్​షో 2025ను టై సంస్థ నిర్వహించింది. ఈ కార్యక్రమం టై విమెన్​ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేశారు. మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించడం, అవకాశాల ద్వారా వారి వ్యాపారాల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా దీనిని నిర్వహించామని టై తెలిపింది. 

ఈ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షోలో వివిధ రంగాల నుంచి వచ్చిన మహిళా స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నాయకులు, మార్గదర్శకులు,  భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలు, నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్కింగ్​  సెషన్స్​ జరిగాయి.  టై గ్లోబల్​ చైర్మన్ బుక్క పట్నం మురళి మహిళా పారిశ్రామిక రంగ భవిష్యత్తు గురించి మాట్లాడారు. అనంతరం ‘షీ బిల్డ్స్​, షీ లీడ్స్​’ పేరుతో అంకిత్​షా ప్యానెల్​ డిస్కషన్​ నిర్వహించారు.  మహిళా వ్యాపారవేత్తలు ఆర్తి జోషి, చెరువు జ్యోత్స్న, కవితా మంథా, సుందరి పీసుపాటి  తమ అనుభవాలగురించి చర్చించారు.