
హైదరాబాద్, వెలుగు: మహిళలు నిర్వహించే స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రొటో టైపింగ్సెంటర్ టీ–వర్క్స్లో విమెన్రోడ్షో 2025ను టై సంస్థ నిర్వహించింది. ఈ కార్యక్రమం టై విమెన్ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేశారు. మహిళా వ్యాపారవేత్తలకు ప్రోత్సాహం అందించడం, అవకాశాల ద్వారా వారి వ్యాపారాల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా దీనిని నిర్వహించామని టై తెలిపింది.
ఈ రోడ్షోలో వివిధ రంగాల నుంచి వచ్చిన మహిళా స్టార్టప్ వ్యవస్థాపకులు, పరిశ్రమ నాయకులు, మార్గదర్శకులు, భాగస్వాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చలు, నెట్వర్కింగ్ సెషన్స్ జరిగాయి. టై గ్లోబల్ చైర్మన్ బుక్క పట్నం మురళి మహిళా పారిశ్రామిక రంగ భవిష్యత్తు గురించి మాట్లాడారు. అనంతరం ‘షీ బిల్డ్స్, షీ లీడ్స్’ పేరుతో అంకిత్షా ప్యానెల్ డిస్కషన్ నిర్వహించారు. మహిళా వ్యాపారవేత్తలు ఆర్తి జోషి, చెరువు జ్యోత్స్న, కవితా మంథా, సుందరి పీసుపాటి తమ అనుభవాలగురించి చర్చించారు.