బాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త మూవీ టైగర్ 3 ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైంది. భారీ రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్న ఈ మూవీలోని ఓ క్లిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్లిప్ ను సోషల్ మీడియా యూజర్స్ తెగ షేర్ చేస్తూ... తమ అభిమాన హీరోపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
టైగర్ 3 మూవీలో రెండు సార్లు జాతీయ గీతం ప్లే కావడంతో అభిమానులు గర్వం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా క్లైమాక్స్లో టైగర్, జోయా (సల్మాన్, కత్రినా పాత్రలు) ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గౌరవసూచకంగా.. పాకిస్తానీ గడ్డపై పాకిస్తానీ జాతీయుల చిన్నారులచే జాతీయ గీతాన్ని ప్లే చేస్తారు. ఈ దృశ్యాన్ని చూసిన అభిమానులు తమ ఆనందాన్ని షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు. ఇది కేవలం సల్మాన్ ఖాన్ మాత్రమే దీన్ని చేయగలుగుతారంటూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
మనీష్ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3లో సల్మాన్ భారతదేశపు ఉత్తమ ఏజెంట్ టైగర్గా తన కుటుంబాన్ని, దేశాన్ని శత్రువు(ఇమ్రాన్ హష్మీ ) నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీ.. తన కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.
Say wallah the whole cinema stood up for Indian national anthem for Tiger 3.. This can’t be real ??? pic.twitter.com/q3j7gn1at6
— Zee (@Officia1Zee) November 11, 2023