![జూపార్క్లో పులి మృతి](https://static.v6velugu.com/uploads/2024/05/41_9T2UpMwWcu.jpg)
- ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అభిమన్యు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో అభిమన్యు(9) అనే మగపులి మంగళవారం మృతి చెందింది. బెంగాల్టైగర్ అభిమన్యు.. ఏడాదిగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ కన్నుమూసింది. 2015 జనవరిలో ఆ పులి జన్మించింది. కొంతకాలంగా వైద్యం అందిస్తున్నప్పటికీ ఈ నెల 5వ తేదీ నుంచి నడవడానికి కూడా వీలులేని స్థితికి చేరుకుంది. మూడు రోజుల నుంచి సమస్య తీవ్రం కావడంతో క్రిటికల్ స్థితికి చేరుకుంది. మంగళవారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో అభిమన్యు మృతి చెందింది.