న్యూజిలాండ్ స్టార్ పేసర్ టీమ్ సౌథీ.. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఎనిమిదేళ్ల బాలికకు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. WTC ఫైనల్లో ధరించిన జెర్సీల్లో ఒకదానిని వేలానికి పెట్టాడు. ఆ వచ్చిన డబ్బును ఆ చిన్నారి ట్రీట్మెంట్ కు ఖర్చు చేయనున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సౌథీ 4 వికెట్లు తీసి భారత్ ఓటమికి కారణమయ్యాడు. అప్పుడు ధరించిన జెర్సీపైనే తన సహచర ఆటగాళ్లతో సంతకాలు చేయించి వేలంలో పెట్టాడు. న్యూరోబ్లాస్టోమా అనే అరుదైన క్యాన్సర్తో బాధపడుతున్న హోలీ బీటీ అనే బాలికకు సాయం చేసేందుకే ఈ జెర్నీని వేలంలో పెడుతున్నట్లు సౌథీ తెలిపాడు.
జెర్సీ వేలం ద్వారా.. హోలీకి మెరుగైన వైద్యం అందించాలని నిర్ణయించుకున్నాడు సౌథీ. ఈ వేలానికి జులై 8 వరకూ బిడ్లు దాఖలు చేయవచ్చని తెలిపాడు. ఇవాల(మంగళవారం) ఉదయం వరకూ 152 బిడ్లు దాఖలు కాగా.. అత్యధికంగా 7 వేల డాలర్ల బిడ్ వచ్చిందని తెలిపాడు.