తిరుమల ఘాటు రోడ్డుపై ఓ కారు ప్రమాదానికి గురైంది. తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. రెండవ ఘాట్ రోడ్లో మలుపు వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి .డివైడర్ ను ఢీకొని బోల్తాపడింది. . ఈ ఘటనలో తమిళనాడు భక్తులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న టీటీడీ అధికారులు క్షతగాత్రులను తిరుమల అశ్వని ఆసుపత్రికి తరలించారు. ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ను క్రమబద్దీకరించి.. సహాయక చర్యలు చేపట్టారు.
