కోల్కతా: దేశంలోని ముస్లింల్లో 30 శాతం మంది కలసివస్తే పాకిస్థాన్ లాంటి మరో నాలుగు దేశాలను ఏర్పాటు చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో షేక్ ఆలం వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆలం వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను మమతా బెనర్జీ ఆమోదిస్తారా? ఇదేనా బెంగాల్కు కావాల్సింది అంటూ మాలవీయ ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో వైరల్ అవుతోంది.