- టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్
న్యూఢిల్లీ: మణిపూర్ లో మారణహోమం జరుగుతోంది.. ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన వీడియో వంటి దారుణాలు లెక్కలేనన్ని చోటుచేసుకున్నయని టీఎంసీ ఎంపీ కకోలీ ఘోష్ దాస్తీదార్ లోక్ సభలో వెల్లడించారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఘోష్ మాట్లాడుతూ.. కత్తిరించిన జుట్టు, తెగిన కుత్తుకలతో మహిళల డెడ్ బాడీలు మణిపూర్ రోడ్లమీద పడి ఉన్నయని ఆవేదన వ్యక్తం చేశారు. రిలీఫ్ క్యాంపుల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని చెప్పారు.
రాష్ట్రంలో సామాన్యుడి చేతికి అత్యాధునిక ఆయుధాలు ఎలా వచ్చాయని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశీ శక్తులేవైనా వారికి సహకరిస్తున్నాయా.. లేక కేంద్ర ప్రభుత్వమే టెర్రరిస్టుల సాయం తీసుకుందా? అని నిలదీశారు.
అందుకే అల్లర్లపై కేంద్రం మౌనాన్ని ఆశ్రయించిందా అంటూ కకోలీ ఘోష్ మండిపడ్డారు. ఏకే 47 లతో పాటు అత్యాధునిక ఆయుధాలు బెంగాల్ లోకి చేర్చే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.