బెంగాల్‌‌ను దారుణాల నుంచి రక్షిస్తాం

బెంగాల్‌‌ను దారుణాల నుంచి రక్షిస్తాం

ఎగ్రా: బెంగాల్‌‌లో రాజకీయ వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గెలుపు కోసం అన్ని పార్టీలు చెమటోడుస్తున్నాయి. ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. ఈ విషయాన్ని పక్కనబెడితే.. దీదీ కోటను కైవసం చేసుకోవడానికి బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. ఇప్పటికే కీలకమైన తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీ చేర్చుకుంది. తాజాగా వెటరన్ టీఎంసీ ఎంపీ, సువేందు అధికారి తండ్రి సిసిర్ అధికారి కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఎగ్రాలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల క్యాంపెయిన్‌‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన సిసిర్ అధికారి.. ర్యాలీలో జై శ్రీరామ్ నినాదాలు చేయడం గమనార్హం. ‘బెంగాల్‌‌ను దారుణాల నుంచి రక్షించండి. మేం మీతో ఉన్నాం. మా కుటుంబం మీతో ఉంది. జై శ్రీరామ్, జై భారత్’ అని సదరు కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి సిసిర్ చెప్పారు. మిడ్నాపూర్ గౌరవం కోసం తాను పోరాడతానన్నారు.