
హైదరాబాద్ : ఎల్లప్పుడు పనితో బిజీగా ఉండే తల్లులకు కొంత విశ్రాంతిని ఇద్దామని తెలిపారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకుని ప్రతీ మాతృమూర్తికి తెలంగాణ రాష్ట్ర పోలీస్శాఖ శుభాకాంక్షలు తెలిపింది.
ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… అమ్మ జీవితంలో ప్రతీ రోజూ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన రోజు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన రక్షణ కోసం తను తపన పడినట్లుగా ఇంకెవరూ పడరన్నారు. ఈ ప్రపంచంలో తొలి గురువు అమ్మే అన్నారు. మనను కాపాడే రక్షణ కవచమన్నారు. అందరూ ఇంట్లోనే ఉండండి.. లాక్డౌన్ పిరియడ్ను ఒక అవకాశంగా ఉపయోగించుకుని ఎల్లప్పుడు పనితో బిజీగా ఉండే తల్లులకు కొంత విశ్రాంతిని ఇద్దామని ట్వీట్ చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.
We would like to wish every Mother,
'A healthy & happy day, at every day of her life'
No one else can care for us like she do,Our first teacher in this world & A Protecting Shield ever#StayHome& take this #LockDown period as an opportunity to give some rest to #EverWorkingMother pic.twitter.com/drpRA3yqc3— DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 10, 2020