ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు

ఏపీలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు

అమరావతి: ఏపీలో క‌రోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన‌ 24 గంటల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా 89,087 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 22,018 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని తెలిపింది వైద్యారోగ్య‌శాఖ‌. ఇప్పటివరకు రాష్ట్రంలో 13,88,803 మందికి కరోనా వైరస్‌ సోకిందని.. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 96 మంది మృత్యువాతపడ్డారని చెప్పింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 9,173కు చేరిందని.. గడిచిన 24 గంటల్లో 19,177 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ప్రస్తుతం 2,03,787 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని. రాష్ట్రంలో శుక్ర‌వారం వరకు 1,77,91,220 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారని చెప్పింది. ఇప్పటివరకు 11 లక్షల 72 వేల 948 మంది డిశ్చార్జ్ అయ్యారని..ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.