గ్రేటర్ వార్.. నామినేషన్లకు ఇవాళే లాస్ట్

గ్రేటర్ వార్.. నామినేషన్లకు ఇవాళే లాస్ట్

హైదరాబాద్, వెలుగుగ్రేటర్​ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం లాస్ట్​డేట్ కావడంతో భారీగా నామినేషన్లు వేసే చాన్స్ ఉంది. గురువారం వివిధ పార్టీలు మిగిలిన డివిజన్లకు ప్రకటించిన క్యాండిడేట్లు, ఇయ్యాల ఫైనలయ్యే వారంతా నామినేషన్లు వేయనున్నరు. అలాగే టికెట్​రాని వారు ఇండిపెండెంట్ లేదా రెబెల్​గా బరిలో దిగే అవకాశం ఉంది. అయితే గురువారం 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు వేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 537 మంది క్యాండిడేట్లు 597 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ ఎస్ నుంచి అత్యధికంగా195 నామినేషన్లు, ఆ తరువాత బీజేపీ నుంచి 140, కాంగ్రెస్ పార్టీ నుంచి 68, టీడీపీ నుంచి 47, ఎంఐఎం పార్టీ నుంచి 27 , ఇండిపెండెంట్లు 110 మంది నామినేషన్లు వేశారు. మరోవైపు ప్రధాన పార్టీలన్ని కూడా ఇప్పటి వరకు మొత్తం డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించలేదు. టీఆర్ ఎస్ పార్టీ125 మందిని ప్రకటించగా.. బీజేపీ 39 మంది అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. కాంగ్రెస్ 61మంది క్యాండిడేట్లను ఖరారు చేసింది.