ఓల్డ్సిటీ, వెలుగు: తెలంగాణ బార్కౌన్సిల్ఎన్నికలు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. మొత్తం 25 మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండగా ఈ ఎన్నికల్లో 23 మందికి ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇందులో 18 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉంటారు. మరో ఇద్దరు మహిళలను కో ఆప్షన్మెంబర్స్గా నామినేట్చేస్తారు.
రెండేండ్లకోసారి జరగవలసిన ఎన్నిక 8 ఏండ్లుగా జరగకపోవడంతో ఈసారి భారీ పోటీ నెలకొన్నది. దీని కోసం ఏకంగా ఈసారి 203 మంది న్యాయవాదులు బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 93 బార్అసోసియేషన్లలోని 116 పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 35, 316 మంది అడ్వొకేట్లు ఓటు వేయన్నారు.
ఇలా ఓటెయ్యాలి
పోలింగ్ ఆఫీసర్ఇచ్చిన బ్యాలెట్ పేపర్, పెన్నుతోనే ఓటు వేయాలి. ఇతర పెన్నులు వాడితే దాన్ని చెల్లని ఓటుగా పరిగణిస్తారు. పోటీ చేస్తున్న అభ్యర్థికి ఎదురుగా ఇచ్చిన గడిలో వన్, టు, త్రీ అని ఇంగ్లీషులోనే రాయాల్సి ఉంటుంది. ఒక్క ఓటరు కనీసం ఐదు నంబర్ల వరకు రాయాలి. గరిష్టంగా 23 వరకు ఓట్లు వేయవచ్చు.
ఒకటి నుంచి ఐదు వరకు వరుస క్రమంలో రాస్తూ మధ్యలో ఏదైనా నంబర్మిస్చేస్తే మిస్చేసిన నంబర్నుంచి తర్వాత నంబర్లను పరిగణలోకి తీసుకోరు. వన్నంబర్తప్పనిసరి అది లేకుండా టూ, త్రీ రాసినా ఓటు చెల్లదు. ఒక నంబర్ను ఒక్కరికే ఇవ్వాలి. రైట్, రాంగ్అంటూ టిక్మార్కులు, సంతకాలు, వేలిముద్రలు పెట్టొద్దు.
స్పెల్లింగ్తప్పు రాసినా ఓటును సరైనదిగా పరిగణించరు. ప్రధాన ఎన్నికల అధికారిగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎతిరాజు, సహాయ ఎన్నికల అధికారిగా కవిత యాదవ్, దీపక్పర్యవేక్షించనున్నారు. బీసీ సామాజిక న్యాయం అంటూ ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
