
రేపు చంటిపిల్లల తల్లిదండ్రులకు
తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి దర్శనంలో భాగంగా వయోవృద్ధులు (65 సంవత్సరాలు పైబడినవారు), దివ్యాంగులకు మంగళవారం 4 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేలు, 3 గంటల స్లాట్కు వెయ్యి టోకెన్లు జారీ చేస్తారు. ఐదేళ్లలోపు చంటిపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు బుధవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సుపథం ద్వారా ఉచిత దర్శనానికి అనుమతిస్తారు.