కేటీఆర్ ను రాహుల్ గుర్తుపట్టడు

కేటీఆర్ ను రాహుల్ గుర్తుపట్టడు

ప్రజాసమస్యలను గాలికి వదిలేసి సీఎం కేసీఆర్ చిల్లర రాజకీయాలకు తెరలేపారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కళ్లు కాంపౌండ్ లో తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడేవాళ్లలా టీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కార్పొరేట్ స్థాయిలో జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నుండి జాతీయస్థాయి వరకు ఎదిగిన కార్పొరేట్ సంస్థల కోసమే ఈ మీటింగ్ పెడుతున్నట్టు ఉందన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు కనిపిస్తున్నాయని..ఇక్కడ వున్న కాంట్రాక్టర్లు ఇచ్చిన డబ్బులతోనే వాటిని పెట్టినట్టు కనిపిస్తుందన్నారు.