ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని దివాళా తీయించారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ భవన్ లోస్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండాను రేవంత్ అవిష్కరించారు. అనంతరం మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్రం గత ఏళ్లుగా స్లోగన్స్ కు మాత్రమే పరిమితమైందని అన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు హామీ ఏమైనయ్ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఆరోగ్యశ్రీని సీఎం నిర్వీర్యం చేశాడన్నారు. దేశాన్ని ప్రగతిఫథం వైపు నడిపింది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు.