ఈడీ దాడులకు కాంగ్రెస్ భయపడదు

ఈడీ దాడులకు కాంగ్రెస్ భయపడదు

ఈడీ దాడులకు కాంగ్రెస్ భయపడబోదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో సోనియా, రాహుల్ కి ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈడీ చర్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి పక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈడీని పావుగా వాడుకుంటోందని తెలిపారు. కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పటికీ... కాంగ్రెస్ అంటే బీజేపీకి భయం కలుగుతోందన్నారు. అందుకే ఈ దాడులని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తల కోసం...

పోడు భూములకు పట్టాలిచ్చాకే హరితహారం చేపట్టాలి

నేరస్థులు నేరాన్ని ఒప్పుకుంటారా?