- టీపీఆర్ఎంఈఏ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జూనియర్, సీనియర్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు కల్పించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి చెప్పారు. దాదాపుగా 240 మందికిపైగా పదోన్నతులు రావడంతో సోమవారం ఖైరతాబాద్లోని పీఆర్, ఆర్డీ శాఖ కార్యాలయంలో కమిషనర్దివ్య దేవారాజన్ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, నందకుమార్, శ్రీనివాస్రావు, అనంత్ తదితరులు పాల్గొన్నారు.
