అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
  • తీవ్ర గాయాలతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి

సిద్దిసేట జిల్లా: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలై ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ట్రాక్టర్ ఇంట్లోకి దూసుకెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కె బి కాలనీ సమీపంలోని ప్రధాన రహదారి మలుపు వద్ద తిప్పట్ల వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ ట్రాక్టర్ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హుస్నాబాద్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (యజమాని) మేడబోయిన రాజు (37) కు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.