అదుపు తప్పిన ట్రాక్టర్..కూలీలకు తీవ్ర గాయాలు

అదుపు తప్పిన ట్రాక్టర్..కూలీలకు తీవ్ర గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

చిట్యాల మండలంలోని ముచినిపర్ది గ్రామానికి 30 మంది కూలీలు మిర్చి పంట కోయడానికి ట్రాక్టర్లో వెళ్తున్నారు. అయితే భావుసింగ్ పల్లి గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం ఏడుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.