మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం

మద్యం మత్తులో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం

హైదరాబాద్ : హైదరాబాద్ లో మద్యం మత్తులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. సైఫాబాద్  పోలీస్ స్టేషన్ కు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ బి. శ్రీనివాస్.. ఫుల్లుగా మద్యం తాగి తన స్నేహితులతో కలిసి రోడ్డుపై నానా హంగామా చేశారు. టూవీలర్ పై వస్తున్న యువకులపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ యువకులదే తప్పు అంటూ వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కొంతమంది యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఖైరతాబాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ వద్ద జరిగింది. బాధితులు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానిస్టేబుల్ బి. శ్రీనివాస్ పై బాధితుల బంధువులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.