నల్గొండ అర్బన్, వెలుగు : నల్గగొండ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి శనివారం సుమారు 40 నిమిషాల పాటు తాళం వేశారు. ఇక్కడ 25 –30 మంది సిబ్బంది ఉండగా నలుగురు డిప్యూటేషన్పై వెళ్లారు. 15 నుంచి 20 మంది ఎలక్షన్డ్యూటీలకు వెళ్లారు. సుమారు 10 మందికి చౌరస్తాల వద్ద డ్యూటీ వేశారు. సీఐ, ఎస్ఐతో పాటు మిగిలిన కొందరు హైకోర్టు చీఫ్జస్టిస్..జిల్లా కోర్టుల సముదాయం ప్రారంభానికి రావడంతో అక్కడ డ్యూటీకి వెళ్లారు.
దీంతో స్టేషన్మొత్తం ఖాళీ అయిపోయింది. ఎవరూ లేకపోవడంతో తాళం వేసి వెళ్లిపోయారు. సుమారు 40 నిమిషాల తర్వాత లాక్ఓపెన్చేశారు. ఈ విషయమై నల్లగొండ ట్రాఫిక్ సీఐని వివరణ కోరగా తాను కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ఉండగా వెళ్లానని, అవగాహన లేని సిబ్బంది తాళం వేశారని వివరణ ఇచ్చారు.