కూంబీంగ్ చేస్తూ.. కరెంట్ షాక్ తో గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ మృతి

కూంబీంగ్ చేస్తూ.. కరెంట్ షాక్ తో గ్రే హౌండ్స్  కానిస్టేబుల్ మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవిలో వేటగాళ్లు అమర్చిన విద్యుదాఘాతానికి గురై ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడు. రేపు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ పర్యటన నేపథ్యంలో కాటారం మండలం నస్తూపల్లి అటవి ప్రాంతంలో  గ్రే హౌండ్స్ దళాలు కూంబీంగ్ ఆపరేషన్ నిర్వహించారు. కానిస్టేబుల్ ప్రవీణ్ కు జంతువులను వేటాడటానికి ఏర్పాటు చేసిన ఎలక్టికల్ వైర్లు ప్రమాదవశాత్తు తగిలాయి. వెంటనే  కానిస్టేబుల్ అస్వస్తతకు గురైయాడు. అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే కానిస్టేబుల్ ప్రవీణ్ చనిపోయాడు.