ట్రాలీ ఆటో ఢీకొని బైకర్ మృతి.. కీసరలో ఘటన

ట్రాలీ ఆటో ఢీకొని బైకర్ మృతి.. కీసరలో ఘటన

కీసర, వెలుగు: ట్రాలీ ఆటో ఢీకొని బైక్​పై వెళ్తున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెంకటరమణ రాంపల్లి ఆర్​ఎల్​ నగర్​లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో కుటుంబంతో కలిసి కీసరగుట్టకు వచ్చాడు. భోజనానికి కావాల్సిన సామగ్రి తెచ్చేందుకు కీసరగుట్ట నుంచి బైక్​పై కీసరకు బయల్దేరాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న అశోక్​ లీలాండ్​ గూడ్స్​ వెహికల్​ ఢీకొట్టడంతో స్పాట్​లో చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీసీఎం ఢీకొని..

జీడిమెట్ల: డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన పేట్​బషీరాబాద్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఎస్సై మహేశ్వర్​రెడ్డి తెలిపిన ప్రకారం.. శామీర్​పేట దేవరయాంజల్​ గ్రామానికి చెందిన గొడుగు బాలరాజు(44) ప్రైవేటు ఉద్యోగి. సోమవారం తన ఇంటి వద్ద గల డయాగ్నోస్టిక్​ సెంటర్​ వద్ద నిలబడి ఉన్నాడు. తూము కుంట నుంచి దేవరయాంజల్​ వైపు వస్తున్న డీసీఎం రోడ్డు పక్కన నిల్చున్న బాలరాజును ఢీకొట్టడంతో చనిపోయాడు.