- రూ. 10 వేలు తీసుకుంటూ దొరికిన ట్రాన్స్ కో అధికారులు
- లైన్ ఇన్స్పెక్టర్, లైన్మన్ను అరెస్ట్ చేసిన ఏసీబీ
మాదాపూర్, వెలుగు: కరెంట్మీటర్పెట్టేందుకు లంచం తీసుకుంటూ ట్రాన్స్కో అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికారు. మాదాపూర్సాయినగర్లో ఉండే ఎం. లక్ష్మణ్ కుమార్తె నాగజ్యోతి ఇంటికి కరెంట్ మీటర్ కోసం కొద్ది రోజుల కిందట అప్లై చేసుకుంది. మాదాపూర్ ట్రాన్స్ కో లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్రావు, లైన్మన్ ఎం. సతీష్ రూ. 10వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో లక్ష్మణ్ ఏసీబీకి కంప్లయింట్చేశాడు. శనివారం ఉదయం మాదాపూర్ ట్రాక్స్కో ఆపరేషన్స్ ఆఫీస్లో లక్ష్మణ్ నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటున్న లైన్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్రావు, లైన్మన్ ఎం. సతీష్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచినట్టు ఏసీబీ డీజీ అంజనీ కుమార్ తెలిపారు.
