ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్: ‘ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడండి.. అన్ని సమస్యలపై చర్చించి సవరించండి.. ఆ తర్వాతే బదిలీలు, నియామకాలు చేపట్టాలి..’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317ను వెంటనే  సవరించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 
సోషల్ మీడియా ద్వారా బదిలీలకు సంబంధించిన సమాచారం లీక్ చేస్తూ ప్రభుత్వం వారికి నిద్ర లేకుండా చేస్తూ.. ఉద్యోగస్తులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒత్తిడి చేయడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.