
- అసెంబ్లీ ముట్టడికి యత్నం
- సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవురోజుగా ప్రకటించాలని డిమాండ్
- లంబాడీ, గిరిజన హక్కుల పోరాట సమితి సభ్యులను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: సేవాలాల్ మహరాజ్ జయంతి (ఫిబ్రవరి 15) ప్రతి ఏటా సెలవు రోజుగా ప్రకటించాలని లంబాడీ, గిరిజన హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. క్యాబినెట్ లో గిరిజనులకు అవకాశం కల్పించాలని ఆయా సంఘాల నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాగా సేవాలాల్ జయంతి రోజున సెలవు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు.