
వెలుగు, ఎల్బీనగర్: గ్రేటర్ పరిధిలో దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్కిళ్ల వారీగా ట్రై సైకిళ్లు అందజేసింది. అయితే, అధికారుల అలసత్వం కారణంగా అర్హులైన లబ్ధిదారులకు ఇవన్నీ అందకుండా జీహెచ్ఎంసీ ఆఫీసుల్లో మూలనపడి పాడవుతున్నాయి. ఎల్బీ నగర్ జోన్లోని సరూర్ నగర్ సర్కిల్ ఆఫీస్లో ట్రై సైకిళ్లు గత 8 నెలలుగా ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.