గ్రేటర్ పరిధిలో మూలనపడ్డ మూడు కాళ్ల సైకిళ్లు

గ్రేటర్ పరిధిలో మూలనపడ్డ మూడు కాళ్ల సైకిళ్లు

వెలుగు, ఎల్బీనగర్: గ్రేటర్​ పరిధిలో దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్కిళ్ల వారీగా ట్రై సైకిళ్లు అందజేసింది. అయితే, అధికారుల అలసత్వం కారణంగా అర్హులైన లబ్ధిదారులకు ఇవన్నీ అందకుండా జీహెచ్‌ఎంసీ ఆఫీసుల్లో మూలనపడి పాడవుతున్నాయి. ఎల్​బీ నగర్ జోన్​లోని సరూర్‌ నగర్ సర్కిల్ ఆఫీస్​లో ట్రై సైకిళ్లు గత 8 నెలలుగా ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది.