షరతులు వర్తిస్తాయి పోస్టర్‌‌ లాంచ్

షరతులు వర్తిస్తాయి పోస్టర్‌‌ లాంచ్

చైతన్య రావు, భూమి శెట్టి జంటగా కుమార స్వామి (అక్షర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు  నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌‌ను త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మనుషులు ఉన్నంత కాలం కుటుంబాలు, కుటుంబాలు ఉన్నంతకాలం సమస్యలు  ఉంటాయి. అందుకే చాలా  కుటుంబాలు కొన్ని షరతుల మధ్యన జీవిస్తూ ఆనందంగా  ఉంటున్నాయి.

ఇది అలాంటి మన కుటుంబ విలువల గురించి తీసిన సినిమా. మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీమ్‌ అందరికీ ఆల్ ద బెస్ట్’ అన్నారు. ‘మధ్య తరగతి కుటుంబాలలో ఉంటున్న సమస్యలను దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించాడని’ సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు.