సాగర్ లో కరోనా పంజా.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు పాజిటివ్

సాగర్ లో కరోనా పంజా.. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు పాజిటివ్

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో కరోనా పంజా విసిరింది. పోలింగ్ రోజు కరోనా ఎక్కువగా విస్తరించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చింది. టీఆర్ఎస్ నేత కోటిరెడ్డి, కడారి అంజయ్య యాదవ్ లకు కరోనా సోకింది. పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలకు కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పెద్దవూరలో 59, హాలియాలో 66, గుర్రంపోడు 11, నిడమనూరులో 7, నాగార్జునసాగర్ లో 17 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 160 కేసులు వచ్చినట్లు తెలిపారు అధికారులు.