
జవహర్నగర్, వెలుగు: తమ డివిజన్ల అభివద్ధికి నిధులు ఇవ్వకుండా మేయర్, డిప్యూటీ మేయర్ ఇద్దరూ వారికి అనుకూలంగా ఉండే డివిజన్లకే కేటాయిస్తున్నారంటూ జవహర్నగర్ టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపించారు. గురువారం కార్పొరేషన్ ఆఫీసులో నిర్వహించిన కౌన్సిల్మీటింగ్ను బాయ్కాట్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేయర్మేకల కావ్య కార్పొరేషన్ సిబ్బందిని తన సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
కౌన్సిల్ మీటింగ్కు వచ్చి అరగంటసేపు వేచి చూసినా తమకు కనీసం కుర్చీలు కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ఏర్పడి మూడేండ్లు గడుస్తున్నా ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని వాపోయారు. తమ డివిజన్లలోని కాలనీల్లో పర్యటించాలంటే ఇబ్బందిగా ఉందని, జనాలు నిలదీస్తున్నారని చెప్పారు. బాయ్కాట్ చేసిన వారిలో కార్పొరేటర్లు, కో–ఆప్షన్సభ్యులు ఉన్నారు.