తప్పు చేస్తే జైలుకు వెళ్ళడానికి రెడీ

తప్పు చేస్తే జైలుకు వెళ్ళడానికి రెడీ

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో మహిళ గొంత కోసిన ఘటన పొలిటికల్ టర్నింగ్ తీసుకుంటోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే పీఏ కావటంతో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారు. 

మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలను..బోరబండ టీఆర్ఎస్ డివిజనల్ కోఆర్డినేటర్ విజయ్ సింహ ఖండించారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయొద్దీన్ కుట్రపూరితంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఫసీయుద్దీన్ దగ్గర తాను గతంలో ఉన్నానని, కానీ అతని మోసాలు తెలిసినప్పటి నుంచి దూరంగా ఉంటున్నట్లుగా తెలిపాడు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండటం, తన ఎదుగుదల చూడలేక ఫసీయొద్దీన్ కుట్రతోనే ఇదంతా చేశాడని విజయ్ సింహ చెప్పారు. అత్యాచారాలు చేసే వ్యక్తులు ఫసీయొద్దీన్ దగ్గరే ఉన్నారని ఆరోపించారు. తాను ఏ ఎమ్మెల్యేకు పీఏను కాదని.. టీఆర్ఎస్ కార్యకర్తనని చెప్పుకొచ్చారు. పోలీస్ దర్యాప్తులో తాను తప్పు చేసినట్లు తేలితే జైలుకు వెళ్ళడానికి రెడీ అన్నారు. లేకపోతే రాజీనామా చేయడానికి సిద్ధమా అని ఫసీయుద్దీన్ కు సవాల్ విసిరారు. బాధిత మహిళ తనకు ఫేస్బుక్ ద్వారా పరిచయమని వెల్లడించారు. వారం రోజుల కింద ఆమె భర్త సూరజ్ తనని కలిసి, తనపై ట్రాప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పినట్లు విజయ్ తెలిపారు. తన దగ్గర అన్ని అధారాలున్నాయని,  విచారణలో నిజానిజాలు తేలుతాయని విజయ్ స్పష్టం చేశారు.