మెదక్, మెదక్టౌన్, వెలుగు: మున్సిపల్ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్పార్టీలో టికెట్ల లొల్లి షురువైంది. సిట్టింగ్ నైన తనకు పార్టీ టికెట్ఇవ్వకుండా కాంగ్రెస్నుంచి చేరినవారికి కేటాయించడంతో తాజా మాజీ మహిళా కౌన్సిలర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. ఆమె భర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో చోటుచేసుకుంది.
మున్సిపల్ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్పార్టీ క్యాండిడేట్ల ఫస్టు లిస్టును బుధవారం సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విడుదల చేశారు. 32వ వార్డు స్థానంలో టీఆర్ఎస్ క్యాండిడేట్గా బుధవారం సాయంత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన గోదల సాయిరామ్ భార్య మానసను ప్రకటించారు. దీంతో ఆ వార్డు స్థానంలో టీఆర్ఎస్పార్టీ టికెట్ఆశించిన తాజా మాజీ కౌన్సిలర్ గోదల జ్యోతి తీవ్ర నిరాశకు గురయ్యారు.
విషయం తెలియగానే జ్యోతితో పాటు ఆమె భర్త గోదల కృష్ణ అనుచరులతో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కౌన్సిలర్గా గెలిచిన తాను టీఆర్ఎస్లో చేరి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విజయానికి కృషి చేశానని, ఇప్పుడు తనకు కౌన్సిలర్ టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ కంటతడి పెట్టారు. తమకు పార్టీ టికెట్ ఇవ్వకుంటే భార్యభర్తలిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని కృష్ణ బయటకు వెళ్లి కిరోసిన్ తీసుకునివచ్చి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు వద్ద ఒంటిపై పోసుకొన్నాడు.
ఇది గమనించిన అక్కడున్న పార్టీ కార్యకర్తలు, అప్పుడే అక్కడికి చేరుకున్న పోలీసులు అతన్ని సముదాయించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వార్డు అభివృద్ధికి కృషి చేయడంతో పాటు పార్టీ కోసం పని చేస్తే తమకు అవకాశం ఇవ్వకుండా ఈ రోజే పార్టీలో చేరిన వారికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. టౌన్ సీఐ వెంకట్ఆత్మహత్యకు యత్నించిన కృష్ణను అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.