ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది : ఎం. కోదండరెడ్డి

ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది : ఎం. కోదండరెడ్డి

టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు కిసాన్ కాంగ్రెస్ జీతీయ ఉపాధ్యక్షడు ఎం కోదండరెడ్డి. రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ ఇంత వరకు రైతు అంశాలపై చర్చ జరపలేదన్నారు. రైతు రుణ మాఫీ గతంలో ఆరు సార్లు ఇచ్చి రైతులను ఇబ్బందులు పెట్టిన కేసీఆర్.. ఈ సారి కనీసం రుణమాఫీ మాట తీయకపోవడం అన్యాయం అన్నారు. వాయిదా పద్దతి రుణమాఫీతో వడ్డీ కిందకే పోతుందని రైతులకు రుణమాఫీతో ఎలాంటి ఫలితం లేకుండా పోతుందని చెప్పారు. రైతు సమన్వయ సమితి విధానాలను తాము వ్యతిరేకించామన్న ఆయన..రైతు బంధు ఎన్నికలకే పరిమితం కాకుండా అందరూ రైతులకు ఇవ్వాలన్నారు.

రాజకీయం కోసం కాకుండా రైతు ప్రయోజనం కోసం ఉపయోగకరంగా ఉండాలని తెలిపారు కోదండరెడ్డి.రెవిన్యూ రికార్డుల సవరణలో చాలా ఇబ్బందులు వచ్చాయని తెలిపిన కోదండరెడ్డి.. తాము రాజకీయంగా మాట్లాడడంలేదన్నారు. రెండేళ్లు అయ్యింది, ఇంకా లక్షలాది మందికి పాస్ బుక్స్ రాలేదని చెప్పారు. 11 లక్షల మంది బడుగులకు పుస్తకాలు రాలేదని, అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన సంఘటపై ఇంతవరకు ప్రభుత్వం కారణం చెప్పలేదన్నారు.

ఒక వృద్ధ దంపతులు రెవెన్యూ ఉద్యోగులకు లంచాలు ఇవ్వడానికి భిక్షాటన చేసిందని గుర్తు చేశారు. చిగురుమామిడిలో కనకయ్య అనే రైతు నిజమైన రైతు కు పాస్ పుస్తకం ఇవ్వడానికి లంచం తీసుకొని కూడా ఇవ్వకపోతే అత్మ హత్యచేసుకోవడానికే ప్రయత్నం చేస్తే ఆయన్ను జైల్లో పెట్టడం దారుణమన్నారు. కేటీఆర్  రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.. కానీ రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదని చెప్పారు. లక్షల మంది రైతాంగ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు కోదండరెడ్డి.