సౌలతులు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కారు ఫెయిల్

సౌలతులు కల్పించడంలో టీఆర్ఎస్ సర్కారు ఫెయిల్

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో కనీస సౌలతులు కల్పించడంలో టీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఫెయిలైందని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చదువుకునేందుకు పుస్తకాల్లేవని, చదువు చెప్పే టీచర్లు లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పాలనలో అస్తవ్యస్తంగా మారిన సర్కారు బడులపై కాంగ్రెస్ నజర్’ అంటూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపారు.  

అచ్చంపేట నియోజకవర్గం తాగపూర్ ప్రభుత్వ బడి దుస్థితిని వీడియో రూపం లో షేర్ చేశారు. పెచ్చులూడిన గోడలు, తరగతి గదుల్లో సౌకర్యాల లేమి, కలు షిత తాగునీరు, పురుగులు పట్టిన అన్నం, అపరిశుభ్ర పరిసరాలను ఆ వీడియోలో వివరించారు.